12/19/2017
---నేడు ప్రపంచ వలసదారుల దినోత్సవం---
నేడు ప్రపంచ వలసదార్ల దినోత్సవం. కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషి తన మనుగడ సాగించేందుకు నిరంతర ప్రయాణం సాగించేవాడు, ఆ ప్రయాణంలో వేటలుండేవి, కొట్లాటలుండేవి, నిరంతర యుద్ధం చేసే వాడు మనిషి, కాలం గడిచింది ఖండాలు, దేశాలు ఏర్పడ్డాయి, పాలకులు,పాలితులు ఏర్పాడ్డారు. మనిషి స్థిర జీవనం ఏర్పరుచుకోవటమే లక్ష్యంగా విశేష కృషి జరిగింది. మనిషికి తెలివితేటలు పెరిగాయి అభివృద్ధి పెరిగింది, కానీ నేటికీ మనిషి ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఒకప్పుడు తన కోసం ప్రయాణిస్తే, ఇప్పుడు మరొకడు తరిమితే ప్రయాణిస్తున్నాడు, ఒకప్పుడు ఆకలితో ప్రయాణిస్తే ఇప్పుడు భయంతో ప్రయాణిస్తున్నాడు, ఇప్పుడు కొట్లాటలు ఉన్నాయి తిండి కోసం కాదు అధికారం కోసం అహం నెగ్గించుకోవటం కోసం, ఇప్పుడు వేటలు ఉన్నాయి కానీ వేటాడేది జంతువుల్ని కాదు మనుషుల్ని , ప్రాణాల కోసం తీరాలు ధాటి సాగే ప్రయాణాల్లో ఆ ప్రాణాలే కోల్పోయే వాళ్ళు , ప్రాణమైన బంధాలను కోల్పోయి ఒంటరిగా మిగిలి జీవితాన్ని కోల్పోయే వాళ్ళు ఎందరో, ఈ ప్రపంచం వీరిని పట్టించుకోదు, వీరి ఆర్తనాదాలు ఎవ్వరికి వినిపించవు, కన్నీళ్లు ఎవ్వరికి కనిపించవు, ఈ ప్రపంచంలో మనిషికో మతం, మతానికో దేవుడు ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని కానీ మతం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమని చెప్పే మనిషికి ఇది పట్టదు, మతమంటే దేవుడే అని నమ్మి ఆ దేవుడు ఎం చెప్పాడో మాత్రం కనీసం తెలుసుకోలేని స్థితిలోనే చాలామంది ఉన్నాం, మతం పేరుతోనో మరో పేరుతోనో జరిగే దారుణ మారణకాండ తట్టుకోలేక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు అరచేతే పట్టుకుని వలస బాటపడుతున్నారు, ఈ క్రమంలో కిక్కిరిసిన పడవలలో వెళ్తూ పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, వీరిలో అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా ఉండటం గుండెల్ని పిండేసే విషయం, ఈ సంఘటనల గురించి ఒక్క సారి మనసుతో ఆలోచిస్తే కన్నీటి పర్యంతం కావటం ఖాయం, ఇకనైనా మారదాం సాటిమనిషిని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, చేతనైతే ఆకలి తీరుద్దాం, సర్వం కోల్పోయి మనం వైపు పుట్టెడు బాధతో పొట్టచేత పట్టుకుని వచ్చిన వారిని మన మాటలతో, చేతలతో అవమానపరచకుండా సాటి మనిషిగా వారి కష్టాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం, వారిని ఆదరించే ప్రయత్నం చేద్దాం.