05/09/2021
గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై స్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో వర్చ్యువల్ రన్ సెప్టెంబర్ 2 వ తేదీ నుండి సెప్టెంబర్ ౩0 వరకు నిర్వహించబడుతుంది. ఈ రన్ ద్వారా వచ్చేటటువంటి నిధులు సి ఎం కోవిద్ రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే విదంగా కరోనా విపత్కర సమయంలో అత్యున్నత వైద్య సేవలు అందించనటువంటి వైద్యులను గుర్తించి ఘనంగా సత్కరించడం జరుగుతుంది. సంస్థ అధినేత ఆది నారాయణ గారు మాట్లాడుతూ గౌరవనీయులు, ఎం యల్ సి శ్రీ రమేష్ యాదవ్ గారు చేతుల మీదుగా ఈవెంట్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అని, రిజిస్టర్ చేసుకొని పరుగెత్తిన ప్రతి ఒక్కరు మెడల్ మరియు సర్టిఫికెట్ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించి తమ అభిమానం చాటా వలసినదిగా ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది.